Pakistan: పాక్ కు షాక్..214 మంది బందీలను చంపేసిన బీఎల్ఏ

పాకిస్తాన్ కు బీఎల్ఏ చావు దెబ్బ కొట్టింది. జాఫర్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసి బంధించిన 214 మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ  చంపేసింది. వారి జవాన్లను రక్షించేందుకు గడువు ఇచ్చినా పట్టించుకోలేదని..అందుకే చంపేశామని ప్రకటించింది. 

author-image
By Manogna alamuru
New Update
pak

BLA

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రైలును హైజాక్‌ చేసిన సంగతి తెలిసిందే. బలూచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్‌ చేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఇప్పటికే దీనికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. ఆ ట్రైన్‌లో దాదాపు 450 మంది ప్రయాణికులు తమ అదుపులో ఉన్నారని.. మిలటరీ ఆపరేషన్ చేసేందుకు యత్నిస్తే అందరినీ హతమారుస్తామని కూడా హెచ్చరించింది. ఇందులో 190 మందిని పాక్ భద్రతా బలగాలు రక్షించాయి. కానీ మరో 214 మంది మాత్రం బీఎల్ఏ దగ్గరే ఉండిపోయారు. బలూచ్‌ మిలిటెంట్లు ఐదు వేరు వేరు ప్రాంతాల్లో బంధించినట్లు పాకిస్థా్న్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసిన రాజకీయ ఖైదీలు, ఉద్యమకారులు, అదృశ్యమైన వాళ్లను 48 గంటల్లో విడిచిపెట్టాలని బీఎల్‌ఏ డిమండ్ చేసింది. లేకపోతే తమ దగ్గర ఉన్నవారందరినీ చంపేస్తామని చెప్పింది. 

అందరినీ చంపేశాం...

ఇప్పుడు తాజాగా తమ దగ్గర బందీగా ఉన్న 214 మందినీ చంపేశామని బలూచీ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. యుద్దఖైదీలను విడుదల చేయాలని పాక్ ఆర్మీకి 48 గంటలు గడువిచ్చాం..కానీ వారికి ఇచ్చిన అవకాశాన్ని కూడా వదులుకున్నారు. పొగరుతో కాలదన్నారు. క్షేత్ర పరిస్థితులను పట్టించుకోలేదు. అందుకే 214 మందిని హతమార్చాం...ఈ విధంగా మా 12 మంది అమరవీరులకు నివాళులర్పించాం అంటూ బీఎల్ఏ ప్రకటించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు