జూలై 15న పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్లోని బీచ్ (Australia Green Beach) సమీపంలో ఈ వస్తువు కనిపించింది. ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకి (ISRO) చెందిన రాకెట్లోని పార్ట్ అయి ఉంటుందని కొందరు భావించారు. అంతేకాదు ఇది ఖచ్చితంగా చంద్రయాన్-3కి చెందిన శకలం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు ఇంకొందరు తొమ్మిదేళ్ల కిందట అదృశ్యమైన మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH-370 విమానందేమో అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ దానిని అధ్యయనం చేసి సోమవారం (31-07-2023) రోజున ఒక ప్రకటన చేసింది.
పూర్తిగా చదవండి..వీడిన మిస్టరీ! అది భారత్ PSLV రాకెట్ భాగమే: ఏఎస్ఏ స్పష్టీకరణ
గతకొంతకాలంగా ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అంతుచిక్కని వస్తువు ఎక్కడినుంచి వచ్చిందనే మ్యాటర్ అప్పట్లో మిస్టరీగా మారింది. ఇవాల్టితో దాని మిస్టరీని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేధించారు. ఈ వస్తువు భారత్కు చెందిన రాకెట్దేనని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ (ASA) అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్కు ఉత్తరాన రెండు గంటల ప్రయాణంలో ఉన్న జురియన్ బే సమీపంలో జూలై వారంలో ఈ వస్తువు తొలిసారిగా కనిపించింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
Translate this News: