Telangana results: ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర ట్వీట్‌ వైరల్..

బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్‌ రావులను బీఆర్ఎస్‌ ఓడించిందంటూ ఓ నెటీజన్ ఎక్స్(ట్విట్టర్‌)లో ట్వీట్ చేశాడు. దీనికి స్పందిస్తూ మరో నెటీజన్ కేసీఆర్‌ను బీజేపీ ఓడించిందంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.

New Update
Telangana results: ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర ట్వీట్‌ వైరల్..

తెలంగాణలో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీతో గెలిచింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే బీజేపీ పార్టీ నుంచి బరిలోకి దిగిన బలమైన నేతలు ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఓ వ్యక్తి రాహుల్‌గాంధీని ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. బీజేపీ ఎంపీ బండయ్‌ సంజయ్ బీఆర్ఎస్‌ ఓడించింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ బీఆర్ఎస్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అలాగే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారంటూ ట్వీట్ చేశాడు. అలాగే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీం కాదంటూ రాసుకొచ్చారు. మరోవైపు ఈ ట్వీట్‌కు ఓ వ్యక్తి మరో ఆసక్తికరమైన రీట్వీట్‌ చేశారు. బీజేపీ కేసీఆర్‌ను ఓడించిందంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరలవుతోంది.

publive-image

Advertisment
తాజా కథనాలు