Telangana : గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా రంజోల్ లోని గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న 16ఏళ్ల విద్యార్థిని ఆదివారం మిట్ట మధ్యాహ్నం హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటూ పేరెంట్స్ ఆందోళన చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
Telangana : గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

Suicide : తెలంగాణ(Telangana) గురుకుల పాఠశాలలో మరో దారుణం జరిగింది. ఇప్పటికే పలువురు స్కూల్, కాలేజీ పిల్లల మరణాలు తల్లిదండ్రులను కలవరపెడుతుండగా.. మరో విద్యార్థిని ఆత్యహత్య(Suicide) చేసుకోవడం సంచలనంగా మారింది. తనతో చదువుతున్న స్నేహితులంతా మధ్యాహ్నం భోజనం కోసం వెళ్లగా రూమ్ లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయిన ఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా జహీరాబాద్ రంజోల్ లోని రెసిడెన్సియల్ స్కూల్ లో చోటుచేసుకుంది.

బుక్స్ తెచ్చుకుంటానని చెప్పి.. 
ఈ మేరకు జహీరాబాద్‌ ఎస్సై ప్రసాద్‌రావు, ప్రిన్సిపల్‌ క్రిష్ణవేణి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్‌ మండలం తూంకుంట గ్రామానికి చెందిన బ్యాగరి రాజు, వనజ దంపతుల కుమార్తె స్వప్న(Swapna) (17) రంజోల్‌ గురుకుల పాఠశాలలో ఇంటర్‌(Inter) మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే వార్షిక పరీక్షల షెడ్యూల్‌ వెలువడటంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయలు.

కిటికీలోనుంచి చూసి..
అయితే ఆదివారం మధ్యాహ్న భోజనం తర్వాత రూమ్ లో బుక్స్ తెచ్చుకుంటానని హాస్టల్‌ గదికి వెళ్లింది. చాలాసేపు బయటకు రాలేదు. ఈ క్రమంలోనే మరో విద్యార్థిని కిటికీలోంచి చూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే విషయం గమనించిన స్కూల్ సిబ్బంది ఆమెను జహీరాబాద్‌(Zaheerabad) ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారని స్కూల్ యాజమాన్యం తెలిపింది.

ఇది కూడా చదవండి : CYBER ALERT : ప్రజాపాలననూ వదలని సైబర్ నేరగాళ్లు

స్కూల్ ముందు పేరెంట్స్ ఆందోళన..
ఇక చదువుతోపాటు ఆటపాటల్లో చురుగ్గా ఉండే తమ కూతురు ఆత్మహత్య వార్త విని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఏదో జరిగివుంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక తూంకుంట గ్రామస్థులు, రాజకీయ, సామాజిక సంఘాల నాయకులు గురుకులానికి తరలివచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆరా తీసి జహీరాబాద్‌ ఆర్డీవో వెంకారెడ్డి, గురుకుల అధికారులతో చర్చించి పరిహారంతోపాటు కుటుంబ సభ్యులకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థిని మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు