IT Jobs: ఉద్యోగులకు ప్రముఖ ఐటీ కంపెనీ శుభవార్త.. భారీగా వేతనాల పెంపు!

దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 1న ఉద్యోగుల వేతనాన్ని పెంచనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్తను కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ షాజీ మాథ్యూ టౌన్ హాల్ సమావేశంలో వెల్లడించారు. గత కొన్ని నెలలుగా వార్షిక జీతాల పెంపును వాయిదా వేసిన తర్వాత కంపెనీ ఈ చర్య తీసుకుంది.

Financial Decisions: ఎడాపెడా డబ్బు ఖర్చు చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకుంటే పొదుపు చేయడం పక్కా..!!
New Update

Infosys Salary Hike: దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జీతాల పెంపునకు మోక్షం లభించింది. నవంబర్ 1 నుంచి ఉద్యోగుల జీతాలు పెంచుతామని ఇన్ఫోసిస్ తాజాగా ప్రకటించింది. టౌన్ హాల్ మీటింగ్ లో కంపెనీ చీఫ్ షాజీ మాథ్యూ (Shaji mathew)  ఈ విషయాన్ని వెల్లడించారు. గత కొన్ని నెలలుగా వార్షిక జీతాల పెంపును వాయిదా వేసిన తర్వాత కంపెనీ ఈ చర్య తీసుకుంది.

ఇది కూడా చదవండి: సర్వేలన్నీ నాకే అనుకూలంగా ఉన్నాయి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

ఇన్ఫోసిస్‌లో సీనియర్ మేనేజ్‌మెంట్ కంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు ఏప్రిల్‌లో వార్షిక వేతన పెంపును ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. కంపెనీల్లోని ఇతర వ్యక్తుల జీతాలు జూలైలో పెరుగుతాయి. పరిశ్రమలోని ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు చేపట్టిన బిజినెస్ ఆప్టిమైజేషన్ కారణంగా ఈ ఏడాది జీతాల పెంపును కంపెనీ వాయిదా వేసింది.

ఆదాయాల నివేదిక తర్వాత ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ రాయ్ మాట్లాడుతూ, కంపెనీలోని అసమర్థతలను తొలగించేందుకే జీతాల పెంపును ఆలస్యం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు  తెలిపారు. ఈ చర్యల కారణంగా కంపెనీ మార్జిన్ గణనీయంగా 50 బేసిస్ పాయింట్లు మెరుగుపడిందని ఆయన చెప్పారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్ అక్టోబర్ 12, 2023 గురువారం విడుదల చేసింది. రెండో త్రైమాసికంలో నికర లాభం 3 శాతం పెరిగి రూ.6,212 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ఆదాయం 7 శాతం పెరిగి రూ.38,994 కోట్లకు చేరుకుంది.

ఇది కూడా చదవండి: ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తున్న కమల్ హాసన్-మణిరత్నం

#salary-hike #infosys #it-jobs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe