/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-68-2.jpg)
ఒమాన్ రాజధాని మస్కట్లో దారుణం జరిగింది. సోమవారం షియా మసీదు సమీపంలో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అయితే మరణించిన వారిలో భారత్కు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని ఒమాన్లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ దాడిలో నలుగురు పాకిస్థానీయులతో పాటు ఇద్దరు చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరో 30 మంది గాయాలపాలైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఒక భారతీయుడు మృతి చెందగా.. మరో భారతీయుడు గాయపడ్డారని ఒమాన్ విదేశాంగ శాఖ ఇండియన్ ఎంబసీకి తెలియజేసింది.
🚨 BREAKING 🚨
⚠️ Warning, graphic content ⚠️
Terrorist attack at a Shia mosque outside #Oman’s capital #Muscat.
Initial report 21 dead, many injured. pic.twitter.com/z0hkUXtumC— Fawad Rehman (@fawadrehman) July 16, 2024
Also Read: మందుబాబులకు గుడ్న్యూస్.. త్వరలో లిక్కర్ హోం డెలివరీ..
మరోవైపు ఈ దాడిని పాకిస్థాన్ రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అక్కడ మరణించిన తమ దేశస్థుల మృతదేహాలను పాకిస్థాన్కు తీసుకొచ్చేందుకు ఒమాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. ప్రొపెట్ మహమ్మద్ మనుమడు హుస్సేన్ 7వ శతాబ్దపు బలిదానం జ్ఞాపకార్థం అషురా వేడుక సందర్భంగా ఈ కాల్పులు జరిగాయి. ఈ దాడికి పాల్పడ్డ ముగ్గురు ముష్కరులను పోలీసులు హతం చేశారు. ఈ దాడి వెనుక ఎవరున్నారనే దానిపై ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.
Also read: కుక్కలపై అత్యాచారం చేసి చంపిన కేసులో ఓ వ్యక్తికి 249 ఏళ్ల జైలుశిక్ష!
“Pakistan strongly condemns the dastardly terrorist attack on Imam Bargah Ali bin Abu Talib in Wadi Kabir in Muscat, Oman that resulted in multiple casualties including two deaths of Pakistani nationals. pic.twitter.com/rcRpsuX0p6
— Pakistan Embassy Oman (@PakinOman) July 16, 2024