Mourning Day : రేపు సంతాప దినం ప్రకటించిన భారత్.. కారణం ఇదే

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీ రైసి మరణించిన నేపథ్యంలో ఈ నెల 21న భారత ప్రభుత్వం సంతాప దినం పాటించనున్నట్లు ప్రకటించింది. దేశంలో జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.

Mourning Day : రేపు సంతాప దినం ప్రకటించిన భారత్.. కారణం ఇదే
New Update

India : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ (Iran) అధ్యక్షుడు ఇబ్రహీ రైసీ (Ebrahim Raisi) మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం (Indian Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 సంతాప దినం (Mourning Day) పాటించనున్నట్లు ప్రకటించింది. రైసీ గౌరవార్థం మంగళవారం దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇదిలాఉండగా.. 1989లో ఇరాన్ అగ్ర నేత అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన సమయంలో కూడా భారత్‌ 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.

Also Read: ముగిసిన కేబినెట్ మీటింగ్.. కీలక నిర్ణయాలు ఇవే

#iran-president #ebrahim-raisi #telugu-news #mourning-day
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe