Mourning Day : రేపు సంతాప దినం ప్రకటించిన భారత్.. కారణం ఇదే
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీ రైసి మరణించిన నేపథ్యంలో ఈ నెల 21న భారత ప్రభుత్వం సంతాప దినం పాటించనున్నట్లు ప్రకటించింది. దేశంలో జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.