Andhra Pradesh: విషాదం.. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి..

విజయవాడ పడమటకు చెందిన ముగ్గురు విద్యార్థులు కృష్ణా నదిలో గల్లంతై మృతి చెందడం కలకలం రేపింది. మృతులు 8వ తరగతి విద్యార్థులు నాగసాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్‌, ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న గగన్‌లుగా గుర్తించారు.

Andhra Pradesh: ఏపీలో మరో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతు..
New Update

విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో గల్లంతైన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది. విజయవాడ పడమటకు చెందిన 8వ తరగతి విద్యార్థులు నాగసాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్‌, ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న గగన్‌ ఆదివారం మధ్యాహ్నం సమయంలో నదిలో ఈతకు వెళ్లారు. వీళ్లతో పాటు కానూరుకు చెందిన ఎస్‌కే షారూక్ కూడా వచ్చాడు. కానీ అతను ఒడ్డున ఉన్నాడు. ఆ ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు ఆ నీటిలోనే గల్లంతయ్యారు.

Also Read: పొట్టు పొట్టు కొట్టుకున్న పార్లమెంట్ ఎంపీలు..

దీంతో సమాచారం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు విద్యార్థులు ఇలా ఒకేసారి చనిపోవడంతో.. పడమటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు తల్లిదండ్రులు, బంధుమిత్రుల రోదనలు అక్కడి స్థానికులను కంటతడి పెడుతున్నాయి.

Also Read: నిన్నటి దాకా బాబును అసెంబ్లీలో తిట్టా.. రేపటి నుంచి ఢిల్లీలో తిడతా.. అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

#vijayawada #telugu-news #drown #ap-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe