Telangana: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తుల విషయంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు.తాను పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా చెబుతున్నా.. తెలంగాణలో పొత్తు ప్రసక్తే లేదంటూ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎన్ని రకాలుగా కాళ్ల బేరానికి వచ్చినా బీజేపీ ఒంటరిగా 17 స్థానాల్లో పోటీ చేస్తుందని అన్నారు. ఏనాడైనా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయా? ఆ చరిత్ర కాంగ్రెస్ కే ఉందన్నారు. గత ఎన్నికల్లో ఒక తప్పుడు ప్రచారంచేసి కాంగ్రెస్ లాభపడిందని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు సిద్ధంగా లేరు.. వారంతా పక్క చూపులు చూస్తున్నారని, చాలామంది మాతో టచ్ లో ఉన్నారని లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..BJP: కవితపై విచారణ జరుగుతోంది.. ఎప్పటికైనా అరెస్ట్ తప్పదు: లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీజేపీ ఒంటరిగానే 17 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. అలాగే కవితపై విచారణ జరుగుతోందని, ఆధారాలు లభిస్తే దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తాయని చెప్పారు.
Translate this News: