వరల్డ్కప్ మొదలైన దగ్గర నుంచి సోషల్మీడియాలో క్రికెటర్ల గురించి ఫేక్ న్యూస్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. టీమిండియా క్రికెటర్లు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేశారంటూ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ టైమ్లో ఓ న్యూస్ వైరల్ అయ్యింది. క్రికెటర్లు సిరాజ్, షమీ ఇజ్రాయెల్కి మద్దతుగా ట్వీట్ చేశారంటూ ప్రచారం జరిగింది. అయితే తర్వాత అసలు షమీ, సిరాజ్ ఎవరూ కూడా ఇజ్రాయెల్ గురించి ట్వీట్ పెట్టలేదని తేలింది. ఫేక్ అకౌంట్ల నుంచి అలా ట్వీట్ వచ్చినట్లు స్పష్టమైంది. ఇక అంపైరింగ్ విషయాల్లోనూ ఫొటోలను ఎడిట్ చేస్తూ కొంతమంది ఫేక్ ప్రచారాలు చేశారు. అంపైర్ కరెక్ట్ డిసిషనే ఇచ్చినా ఫొటో ఎడిట్ చేసి బీసీసీఐ అమ్ముడుపోయిందంటూ పాకిస్థాన్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఇలాంటి ఎన్నో ఫేక్ల మధ్య మరో ఫేక్ వచ్చి పడింది. ఈసారి దిగ్గజ పారిశ్రమికవేత్త రతన్టాటా(Ratan Tata) గురించే ఫేక్ న్యూస్ వదిలారు. అది కాస్త క్షణాల్లో వైరల్గా మారింది.
పూర్తిగా చదవండి..FACT CHECK: అఫ్ఘాన్ స్టార్ రషీద్ఖాన్కు రూ.10 కోట్లు ఇచ్చిన రతన్ టాటా..!
అఫ్ఘాన్ క్రికెటర్ రషీద్ఖాన్కు దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్టాటా రూ.10కోట్ల రివార్డ్ ప్రకటించారన్న వార్తలు ఫేక్ అని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా టాటానే ట్వీట్ చేశారు. తనకు అసలు క్రికెట్తో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. జరుగుతున్న ప్రచారంలో అసలు నిజం లేదని స్పష్టం చేశారు. ఇండియా జెండాతో పాక్పై విజయాన్ని రషీద్ సెలబ్రెట్ చేసుకున్నాడని.. దానికి ఐసీసీ రూ.55లక్షలు ఫైన్ వేస్తే.. టాటా రూ.10కోట్లు రివార్డ్ ఇచ్చారంటూ ఫేక్ ప్రచారం జరిగింది.
Translate this News: