ICC WORLD CUP 2023: మాధ్యాహ్నం రెండు గంటలెప్పుడవుతుందా అని యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఫైనల్ ఫైట్ కోసం ఇరు జట్ల అభిమానులే కాదు.. క్రికెట్ క్రీడా లోకం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోంది. ఆదివారం కావడంతో చాలామందికి హాలీడేనే ఉంటుంది. పిల్లలతో, తల్లిదండ్రులతో, ఫ్రెండ్స్తో.. ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా ప్లాన్ గీసుకున్నారు. బిర్యానీలు ఆర్డర్లు చేసుకునేందుకు ఆన్లైన్లో ఆర్డర్లును చెక్ చేసుకుంటున్నారు. అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా లక్షా 30వేలమంది వీక్షించనుండగా.. ఇక టీవీల్లో ఎంతమంది చూస్తారన్నది మ్యాచ్ ముగిసే వరకు చెప్పలేం.
పూర్తిగా చదవండి..IND VS AUS: మోదీ గడ్డపై తొడగొట్టేదేవరు..? ఫైనల్ ఫైట్కు సిద్ధమైన రోహిత్ టీమ్
వరల్డ్కప్ ఫైనల్ ఫైట్కు సమయం దగ్గర పడింది. మధ్యాహ్నం 2గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. వన్డే ప్రపంచకప్లో ఇరు జట్లు 13సార్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 8సార్లు, ఇండియా 5సార్లు గెలిచాయి. ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఎవరు గెలుస్తారే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Translate this News: