Ind vs Eng World Cup 2023: టీమిండియాలో ప్లేయంగ్-11 కాదు.. మొత్తం 15 మంది తోపు ఆటగాళ్లే. ఎవర్ని పక్కన పెట్టినా అయ్యో అనిపిస్తుంది. ముఖ్యంగా వరల్డ్కప్కు (World Cup 2023) భారత్ సెలెక్టర్లు ఎలాంటి వివాదాలను క్రియేట్ చేయకుండా పరఫెక్ట్ టీమ్ని సెలక్ట్ చేశారు. సూర్యకుమార్ సెలక్షన్లో కాస్త విమర్శలు వచ్చిన మాట నిజమే కానీ.. అతను భారత్ పిచ్లపై ఆడుతాడని సెలక్టర్లు సమర్థించుకున్నారు. అయితే ఎంత టాలెంట్ ఉన్నా తుది జట్టులో స్థానం తెచ్చుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా స్టార్ పేసర్ షమీని చూసి ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. మొదట నాలుగు మ్యాచ్లు షమి లేకుండానే భారత్ ఆడింది. బుమ్రా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ పేసర్లగా ఆడారు. ఠాకూర్కి బ్యాటింగ్ కూడా ఆడగలడన్న కారణంతో షమీ ప్లేస్లో అతడిని తీసుకున్నారు. అయితే గత మ్యాచ్లో న్యూజిలాండ్పై షమీ(Shami)ని తీసుకున్నారు. కాపు కాచుకోని కూర్చొన్న చిరుతలా చెలరేగాడు. 5 వికెట్లతో కివీస్ నడ్డి విరిచాడు. కానీ తర్వాతి జరగబోయే మ్యాచ్కు షమీని జట్టులోకి తీసుకోవడం లేదని సమాచారం.
పూర్తిగా చదవండి..IND vs ENG: మ్యాచ్ విన్నర్నే పక్కన పెడుతున్నారా.. ఇదేంటి రోహిత్ బ్రో?
ఆదివారం జరగనున్న ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో భారత్ వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్నో పిచ్ స్పిన్కు అనుకూలిస్తుండడంతో అశ్విన్ను ఆడించాలని రోహిత్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే గత మ్యాచ్లో ఐదు వికెట్లతో సత్తా చాటిన షమి మరోసారి బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది.
Translate this News: