AP News: ఏపీలో ముగ్గురు ఐఏఎస్ లపై బదిలీ వేటు!

ఏపీలో మరో ముగ్గురు ఐఏఎస్ లపై బదిలీ వేటు పడింది. మాజీ సీఎం జగన్ పేషీలో పని చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సెక్రటరీ రేవు ముత్యాలరాజు, అడిషనల్ సెక్రటరీ నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేస్తూ సీఎస్ సౌరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
AP News: ఏపీలో ముగ్గురు ఐఏఎస్ లపై బదిలీ వేటు!

IAS Transfers in AP : ఏపీలో మరో ముగ్గురు ఐఏఎస్ లపై బదిలీ వేటు పడింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవులపై వెళ్లగా.. ఏపీ నూతన సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులైన విషయం తెలిసిందే. కాగా తాజాగా మాజీ సీఎం జగన్ పేషీలో పని చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సెక్రటరీ రేవు ముత్యాలరాజు, అడిషనల్ సెక్రటరీ నారాయణ భరత్ గుప్తాలను సర్కార్ బదిలీ చేస్తూ సీఎస్ సౌరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురని సాధారణ పరిపాలన శాఖ (జీడీఏ)లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. తాజాగా ఈ ముగ్గురి అధికారల బదిలీతో జగన్ పేషీ ఖాళీ అయింది.

Also Read: విజయవాడలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే వంశీ ఇంటిపై దాడి.!

Advertisment
తాజా కథనాలు