MOHAMMAD SHAMI:ప్రస్తుతం భారత్ నుంచి అత్యద్భుతమైన బౌలర్లు ఎవరంటే…మహ్మద్ షమీ పేరు తప్పకుండా వినిపిస్తుంది. వరల్డ్ కప్లో కమ్ బ్యాక్ ఇచ్చిన షమీ అప్పటినుంచి బౌలింగ్ అదరగొడుతూ ప్రత్యర్దులను బెంబేలెత్తిస్తున్నాడు. హార్దిక్ పాండ్య గాయంతో ప్రపంచకప్ కు దూరమవడంతో గ్రౌండ్ లో దిగిన షమీ మొత్తం ఏడు మ్యాచ్ల్లో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించి 24 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. అద్భుతమైన ప్రదర్శనతో వరల్డ్కప్లోనే అత్యుత్తమ బౌలర్గా నిలిచిన షమీ ఫైఫర్లతో అదరగొట్టాడు. ఫైఫర్లు(ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు) తియ్యడం ఇంత ఈజీనా అన్నట్లు సాగింది షమీ ప్రదర్శన. సెమీస్లో ఏకంగా 7వికెట్లు తీసి ఔరా అనిపించాడు. బౌలింగ్ పిచ్లపై షమీ రాణించిన తీరు అందరిని కట్టిపడేసింది. దీంతో భారత ప్రభుత్వం షమీకి అర్జున అవార్డును ఇచ్చింది.
పూర్తిగా చదవండి..Mohammad Shami:నా దేశానికి బెస్ట్ ఇవ్వడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా..మహ్మద్ షమీ
మహ్మద్ షమీ..ట్రెండింగ్లో ఉన్న క్రికెటర్. వరల్డ్కప్లో శ్రీలంక మ్యాచ్ తరువాత ఇతని పేరు వరల్డ్వైడ్గా మారుమోగిపోయింది. అప్పటి నుంచి ఇతనికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. తాజాగా మరోసారి షమీ ట్రెండింగ్ అవుతున్నాడు. అర్జున అవార్డు అందుకుంటున్న వీడియో,అతని పోస్ట్ వైరల్ అవుతున్నాయి.
Translate this News: