Hyderabad woman cricketers coach misbehave:హైదరాబాద్ మహిళా క్రికెట్ జట్టుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తమ ఆటను మెరుగుపరుస్తూ..నిత్యం తమతో ఉండే కోచ్ నుంచే వారికి అనుకోని సంఘటన ఎదురైంది. ట్రైనింగ్ ఇవ్వాల్సిన కోచ్ అసభ్యంగా ప్రవర్తించిన చేదు అనుబవం ఎదురయ్యింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ ఘటన. మ్యాచ్ కోసం మహిళా క్రికెటర్ల హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు విమానంలో రావాల్సి ఉంది. అయితే.. కావాలనే కోచ్ జైసింహా ఆలస్యం చేయడంతో ప్లైట్ మిస్ అయింది. దీంతో వారంతా బస్లో విజవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. వస్తున్న దారిలో జైసింహ బస్సులోనే మందు తాగాడు. తమ ముందు తాగొద్దని ఎంత చెబుతున్నా వినలేదు. పైగా కోపంతో నానా మాటలు మాట్లాడాడు. బండ బూతులు తిట్టాడు. తనను ఎవరైనా ఎదిరిస్తే టీమ్లో నుంచి తీసేస్తానని బెదిరించాడు కూడా.
పూర్తిగా చదవండి..Hyderabad:నువ్వు చేయాల్సిందేంటీ..చేస్తున్నదేంటీ..బస్సులో మహిళా క్రికెటర్ల కోచ్ జై సింహ నిర్వాకం
హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. వాళ్ళకు సరైన మార్గాన్ని చూపించాల్సిన కోచ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో కోచ్ను సస్పెండ్ చేసింది హెచ్సీఏ.
Translate this News: