Telangana: రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ పెట్రోల్ పోసుకున్న వ్యక్తి..

తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న హోటల్ ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. అలర్ట్ అయిన పోలీసులు.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Telangana: రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ పెట్రోల్ పోసుకున్న వ్యక్తి..

Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న హోటల్ ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకున్నాడు. ఈ ఘటనతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. ఈ హోటల్ వేదికగానే.. ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి, మంత్రుల నియామకానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

అయితే, రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ ఓ వ్యక్తి వచ్చి.. ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ ముందు హల్ చల్ చేశాడు. తన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఆ పక్కనే పోలీసులు వెంటనే అలర్ట్ అయి.. అతన్ని నిలువరించారు. పెట్రోల్ చేసుకున్న వ్యక్తి ఒంటిపై నీళ్లు పోశారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

కాగా, తెలంగాణ సీఎం ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. సీఎంగా ఎవరిని నియమించాలనే అంశంపై ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ రాత్రిలోగా సీఎం ఎవరో కాంగ్రెస్ అధిష్టానం తేల్చనుంది.

Also Read:

Telangana Elections: ‘ఈ తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది’.. కేటీఆర్ ట్వీట్..

ISRO: ‘ఆదిత్య ఎల్‌ 1’లో రికార్డయిన సౌరగాలులు.. సోషల్‌ మీడియాలో ఇస్రో ఫోటో..

Advertisment
Advertisment
తాజా కథనాలు