Hyderabad: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం తేదీ ఇదే.. ట్రాఫిక్‌పై కీలక అప్ డేట్

తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి పండగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడు అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా మహాగణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచి వినాయకుడి దర్శనానికి తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంటోంది. కళాకారుల ఆటపాటలతో ఖైరతాబాద్ సందడి సందడిగా ఉంది.

New Update
Hyderabad: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం తేదీ ఇదే.. ట్రాఫిక్‌పై కీలక అప్ డేట్

నిత్యం పూజలు

ఖైరతాబాద్ గణేష్ భార్య నగరంలో విశేష చరిత్ర ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ గణేశ విగ్రహాలలో ఇదీ ఒకటి. ప్రతి సంవత్సరం జరుపుకునే గణేష్ వేడుకలలో ఖైరతాబాద్ గణేష్ సంబరాలకు ప్రత్యేక స్థానం ఉంటోంది. ఖైరతాబాద్ గణేష్ పండుగ తర్వాత వచ్చే 9 రోజుల పాటు యాత్రికులకు దర్శనం కోసం అందుబాటులో ఉంటుంది. ఈ 9 రోజుల్లో ఖైరతాబాద్ గణేష్‌కు యాత్రికులు నిత్యం పూజలు చేస్తారు. చివరి రోజున వచ్చి ఖైరతాబాద్ గణేష్ యొక్క నిమజ్జనానికి యాత్రికులు వెళ్ళవచ్చు. ఖైరతాబాద్ గణేష్ 2023 నిమజ్జనం తేదీ, సమయాలు, నిమజ్జనానికి వెళ్లే మార్గాన్ని కమిటీ వివరాలు ప్రకటించింది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఈనెల 28 సెప్టెంబర్ (గురువారం) 2023గా నిర్ణయించారు. మ. 3 గంటల తర్వాత గణేష్ శోభాయాత్ర ప్రారంభం అవుతుందన్నారు.

ఊరేగింపులో పాల్గొనవచ్చు

భక్తులందరూ నేరుగా ఊరేగింపులో పాల్గొనవచ్చు అని కమిటీ సభ్యులు తెలిపారు. అంతేకాదు ఇతర రకాల వినాయక విగ్రహాలతో పోలిస్తే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి మార్గం ప్రామాణికం. యాత్రికులు ఊరేగింపుతో పాటు వాహనాలను తీసుకెళ్లలేరు. విగ్రహం ఊరేగింపు పూర్తయ్యే వరకు యాత్రికులందరూ కాలినడకన నడవాలి. ఊరేగింపు పూర్తయిన తర్వాత, యాత్రికుల కోసం చివరి పూజ చేసిన అనంతరం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చేస్తారు. వినాయకుడు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నప్పుడు భక్తులు విరాళాలు, ప్రసాదాన్ని కూడా సమర్పించవచ్చు.

ట్రాఫిక్‌ ఆంక్షలు

అయితే ఖైరతాబాద్‌ గణేష్‌ విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో ఈనెల 28 వరకు పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దీని ప్రకారం, రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే ట్రాఫిక్ నిరంకారి జంక్షన్ వైపు మళ్లించారు. రాజ్‌దూత్‌ లేన్ నుంచి బడా గణేష్ వైపు వచ్చే ట్రాఫిక్ ఇక్బాల్ మినార్ వైపు మళ్లించారు. మింట్ కాంపౌండ్ నుంచి IMAX థియేటర్ వైపు ట్రాఫిక్ తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్లించగా.. నెక్లెస్ రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు,.. ఖైరతాబాద్ పోస్టాఫీసు లేన్ నుంచి ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైఫాబాద్ పాత పీఎస్ జంక్షన్ వైపు మళ్లించనున్నారు. సొంత వాహనాల్లో గణేష్ దర్శనం కోసం వచ్చే సందర్శకులు నెక్లెస్ రోటరీ మీదుగా వచ్చి ఖైరతాబాద్ జంక్షన్ రోడ్, రాజ్‌దూత్ లేన్ రోడ్‌లకు దూరంగా ఉండాలన్నారు. గణేష్‌ దర్శనానికి వచ్చే భక్తుల బట్టి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు.
తొలి పూజలో గవర్నర్ దంపతులు
అయితే ఈ ఏడాది శ్రీ దశవిద్య మహాగణపతిగా ఖైరతాబాద్ గణేష్ భక్తులందరికి దర్శనమిస్తున్నారు. మొత్తం 63 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు. ఎడమవైపు వీరభద్ర స్వామి, కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి. భక్తులందరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బారీకేడ్లు, క్యూలైన్లను ఏర్పాటు చేశారు. నగర పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజలో గవర్నర్ తమిళసై దంపతులు, మంత్రి తలసాని పాల్గొన్న విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు