Rajasthan: భార్యను బండికి కట్టి లాక్కెళ్లిన కసాయి భర్త.. వీడియో వైరల్!

తనకు చెప్పకుండా సోదరి ఇంటికి వెళ్లిందని భార్యను బైక్ కు కట్టి లాక్కెళ్లాడు ఓ కసాయి భర్త. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని నర్సాంగాపూర్‌లో చోటుచేసుకుంది. వీడియో వైరల్‌ కావడంతో నిందితుడు ప్రేమ్‌రామ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Rajasthan: భార్యను బండికి కట్టి లాక్కెళ్లిన కసాయి భర్త.. వీడియో వైరల్!
New Update

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. భార్యను బైక్‌కు కట్టేసి లాక్కెళ్లాడు ఓ భర్త. తనకు చెప్పకుండా సోదరి ఇంటికి వెళ్లిందని కోపంతో ఈ దారుణానికి ఒడికట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని నగౌర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగౌర్ జిల్లాలోని నర్సాంగాపూర్‌లో ప్రేమ్‌రామ్ మేఘ్వాల్ సుమిత్ర నివసిస్తున్నారు. వీరిద్దరికి ఆరు నెలల కిందటే పెళ్లి అయ్యింది.

పెళ్లయినప్పటి నుంచి భార్యను చిత్ర హింసలు పెడుతున్నాడు ప్రేమ్‌రాజ్‌. మద్యానికి బానిసైన భర్త వేధింపులు తట్టుకోలే తన సోదరి ఇంటికి వెళ్లింది సుమిత్ర. దీంతో ఆగ్రహించిన ప్రేమ్‌రామ్‌ తనకు చెప్పకుండా ఎందుకు వెళ్లావని నిలదీసి.. ఆమెను ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు. అంతటితో ఆగకుండా తాడుతో బండికి కట్టేసి ఊరంతా లాక్కెల్లాడు. ఇలా అరగంట సేపు లాక్కెళ్లిన తర్వాత కొందరు గ్రామస్తులు సుమిత్రను కాపాడారు. వెంటనే స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రేమ్‌రాజ్‌ ను అరెస్ట్‌ చేశారు. తీవ్ర గాయాలైన సుమిత్రను బంధువులు ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి:  బ్రెయిన్ ఫాగ్‌కు అతిపెద్ద కారణం ఇదే.. తప్పక తెలుసుకోండి!

#rajasthan #viral-video
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe