Hyderabad: భార్యను చంపిన భర్త.. మృతదేహన్ని ముక్కలు చేసేందుకు యత్నం

హైదరాబాద్‌ బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. సాయి అనురాగ్ కాలనీలో ఉంటున్న నాగేంద్ర భరద్వాజ అనే వ్యక్తి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన తన భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసేందుకు యత్నించాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

New Update
Hyderabad: భార్యను చంపిన భర్త.. మృతదేహన్ని ముక్కలు చేసేందుకు యత్నం

హైదరాబాద్‌ బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. సాయి అనురాగ్ కాలనీలో ఉంటున్న నాగేంద్ర భరద్వాజ అనే వ్యక్తి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన తన భార్యను హత్య చేయడం కలకలం రేపింది. కుటుంబ కలహాలతోనే నాగేంద్ర.. తన భార్య మధలతను హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. మే 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: మెట్రోలో ప్రయాణించేవారికి అలర్ట్.. సమయంలో మార్పులు

అయితే భార్యను హత్య చేసిన తర్వాత శరీర భాగాలను ముక్కలుగా చేసేందుకు నాగేంద్ర ప్రయత్నించాడని.. ఆ తర్వాత గ్యాస్ లీకేజీ కారణంగా భార్య మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మధులత తండ్రి రంగ నాయకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగేంద్రను అదుపులోకి తీసుకోని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Also read: గ్రూప్ 1 అభ్యర్థులకు అలెర్ట్.. ఓఎంఆర్‌ పద్ధతిలో ప్రిలిమ్స్

Advertisment
తాజా కథనాలు