Breaking:నాగార్జునాసాగర్ దగ్గర హై టెన్షన్

నాగార్జునా సాగర్ దగ్గర ఉద్రికత్త. ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ. డ్యాం గేట్లను, సీసీ కెమెరాలను ఏపీ పోలీసులు ధ్వంసం చేశారు.

New Update
Breaking:నాగార్జునాసాగర్ దగ్గర హై టెన్షన్

నాగార్జునా సాగర్ దగ్గర అరధరాత్రి గందరగోళం ఏర్పాడింది. నాగార్జున సాగర్ డ్యామ్ పై జలవనరుల శాఖ పరిధి వరకూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వమే పర్యవేక్షించింది. అప్పుడుకూడా సాగర్ డ్యామ్ పై ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు అనుమతించలేదు. అదే ఇప్పుడు కూడా కొనసాగించడంతో గొడవ మొదలైంది. దీంతో ఏపీ పోలీసులకు, తెలంగాణ పోలీసులకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో సాగర్ ప్రాజెక్టు ఎంట్రన్స్ వద్ద సీసీ కెమేరాలు, డ్యాం గేట్లను ఏపీ పోలీసులు ధ్వంసం చేశారు. అయితే ఇంత జరుగుతున్నా ఏపీ వైపు డ్యాం దగ్గర తెలంగాణ ప్రభుత్వం తరపున విధులు నిర్వహించే సిబ్బంది మాత్రం కనిపించలేదు. దీంతో సాగర్ డ్యాం వద్ద భారీగా ఏపీ పోలీసులు వచ్చి చేరారు. ఇంకోవైపు తెలంగాణ వైపు గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజు, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు