Telangana : హైదరాబాద్‌ సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్‌

డీఎస్సీ వాయిదా కోరుతూ సోమవారం సచివాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కానీ రూటు మార్చిన విద్యార్థి సంఘాల సభ్యులు బీఆర్‌కే భవన్‌ వైపు వెళ్లారు. ఈరోజు అక్కడ కాళేశ్వరంపై ఐఏఎస్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమయంలోనే అభ్యర్థులు దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది.

New Update
Telangana : హైదరాబాద్‌ సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్‌

High Tension At Hyderabad Secretariate : హైదరాబాద్‌ సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. డీఎస్సీ (DSC) వాయిదా కోరుతూ సోమవారం సచివాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు డీఎస్సీ అభ్యర్థులకు పిలుపునిచ్చాయి. కానీ రూటు మార్చిన విద్యార్థి సంఘాల నేతలు, అభ్యర్థులు బీఆర్‌కే భవన్‌ (BRK Bhavan) వైపు వెళ్లారు. దీంతో అక్కడ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు బీఆర్‌కే భవన్‌లో కాళేశ్వరం (Kaleshwaram) పై ఐఏఎస్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా అభ్యర్థులు దూసుకొచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది.

Also Read: గోదావరిలో పెరుగుతున్న వరద.. మొదలైన పులస సందడి

Advertisment
తాజా కథనాలు