Keeravani: కీరవాణీ ఇంటి కోడలిగా మురళీమోహన్‌ మనవరాలు..పెళ్లి ఎప్పుడంటే!

కీరవాణి కుమారుడు శ్రీ సింహ వివాహం మురళీ మోహన్‌ మనవరాలు రాగ తో నిశ్చయం అయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వీరి వివాహం హైదరాబాద్ లో జరగనున్నట్లు మురళీ మోహన్‌ తెలిపారు. రాగ ప్రస్తుతం వారి కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్నారు.

Keeravani: కీరవాణీ ఇంటి కోడలిగా మురళీమోహన్‌ మనవరాలు..పెళ్లి ఎప్పుడంటే!
New Update

టాలీవుడ్‌ (Tollywood)  లో వరుస పెట్టి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు  (Star heros) పెళ్లి పీటలు ఎక్కారు. మెగా కాంపౌడ్‌ నుంచి ఇప్పటికే మెగా ప్రిన్స్ పెళ్లిపీటలు ఎక్కి విదేశాల్లో ట్రిప్ వేస్తున్నారు. త్వరలోనే మరో హీరో పెళ్లికి రెడీ అవుతున్నాడు. ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణీ (Keeravani) కుమారుడు శ్రీసింహ(Sree Simha) ..నటుడు మురళీ మోహన్ (Murali Mohan) మనమరాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

తాజాగా ఈ వార్తల గురించి మురళీమోహన్‌ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న (February 14) హైదరాబాద్ తన మనవరాలి వివాహం కీరవాణి కుమారుడితో జరగనున్నట్లు మురళీ మోహన్‌ తెలిపారు. తన పెద్ద మనవరాలి పెళ్లి కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. దాంతో చిన్న మనవరాలి వివాహం కూడా అదే నెలలో జరగాలని నిశ్చయించుకున్నట్లు ఆయన వివరించారు.

మురళీ మోహన్‌ కొడుకు రామ్‌ మోహన్‌. ఆయన ఏకైక కుమార్తె పేరు రాగ (Raaga) . ఆమె కొంత కాలం క్రితమే బిజినెస్‌ లో మాస్టర్స్‌ పూర్తి చేసింది. మురళీ మోహన్‌ కి సంబంధించిన బిజినెస్‌ వ్యవహారాలను ప్రస్తుతం రాగనే చూసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న వారికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

ఈ క్రమంలోనే కీరవాణి కుమారునితో తన మనవరాలు రాగ వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించినట్లు తెలిపారు. కీరవాణి కుమారుడు శ్రీసింహ యమదొంగ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా నటించాడు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు.. ఆ తర్వాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్‌ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా సెటిల్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

Also read: మా బతుకులు ఆగం చేయోద్దు.. మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి!

#keeravani #murali-mohan #granddaughter #marriege #srisimha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe