/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MLC-KAVITHA-jpg.webp)
MLC Kavitha Bail: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam) సీబీఐ అరెస్ట్ ను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. కాగా ఇదే కేసులో కవితపై సీబీఐ (CBI) మరో ఛార్జిషీట్ ను దాఖలు చేసింది. ఇరువురి తరఫున లాయర్ల వాదన విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ నెల 22న విచారణ జరుపుతామని జస్టిస్ కావేరి తెలిపారు. కాగా ఈడీ కేసులోసీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ కి బెయిల్ రావడంతో తమ నాయకురాలు కవితకు కూడా బెయిల్ వస్తుందని ఆశగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు నిరాశే మిగిలింది.
Delhi's Rouse Avenue Court has adjourned the hearing arguments on bail of BRS leader K Kavitha till July 22. She has sought default bail in CBI matter related to Delhi Excise policy case.
(file pic) pic.twitter.com/x2Iv8pjYPC
— ANI (@ANI) July 12, 2024
Also Read: చంద్రబాబును మెచ్చుకున్న కేటీఆర్.. ఎందుకో తెలుసా?