13 ఏళ్ల బాలికతో పెళ్లి.. పది రోజులుగా అత్యాచారం చేసి

13 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకుని పదిరోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డ దారుణమైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో కలకలం రేపింది. భర్త అరాచకం తట్టుకోలేక తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

New Update
13 ఏళ్ల బాలికతో పెళ్లి.. పది రోజులుగా అత్యాచారం చేసి

అమ్మాయిలపై లైంగిక దాడులకు ఆగట్లేదు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడోదగ్గర కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో బస్స్ కోసం వేచివున్న మహిళపై గ్యాంగ్ రేప్ జరగగా.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో స్కూల్ విద్యార్థినిలపై టీచర్లే లైంగిక దాడి చేశారు. ఈ దారుణమైన సంఘటనలు జరిగి కనీసం వారం గడవకముందే మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకుని పదిరోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డ దారుణమైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో కలకలం రేపింది.

ఇది కూడా చదవండి : పోచంపల్లి అభివృద్ధిపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. కార్మికులను చూసి

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ సంఘటన జరిగింది. 13 ఏళ్ల బాలికను ఒక వ్యక్తితో బలవంతంగా వివాహం చేశారు కుటుంబ సభ్యులు. దీంతో ఆ వ్యక్తి బాలికను బలవంతంగా పది రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి అతని అరాచకం తట్టుకోలేక తన బాధనంతా తల్లితో చెప్పుకుంది. ఈ క్రమంలోనే తల్లి బాధితురాలిని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి జరిగిందంతా చెప్పింది. బలవంతపు పెళ్లి, లైంగిక దాడి గురించి ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం పోక్సో సెక్షన్‌తోపాటు, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేస్తామని అజ్మీర్‌ ఏఎస్పీ మహమూద్ ఖాన్‌ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు