Kumaraswamy : కుమారస్వామికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

కేంద్రమంత్రి కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఆయనకు ముక్కు నుంచి ఆగకుండా రక్తస్రావం జరిగింది. దీంతో అక్కడున్న వారు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Kumaraswamy : కుమారస్వామికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
New Update

Central Minister Kumaraswamy Suffering Nose Bleed : కేంద్రమంత్రి కుమారస్వామి (Kumaraswamy) అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరు (Bangalore) లోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనకు ముక్కు నుంచి ఆగకుండా రక్తస్రావం జరిగింది. దీంతో అక్కడున్న వారు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కుమారస్వామి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మీడియా సమావేశంలో బీజేపీ-జేడీఎస్‌ (BJP - JDS) పాదయాత్రపై మాట్లాడుతుండగా ఆయన ఇలా అస్వస్థకు గురయ్యారు.

Also Read: 20 మందిని పెళ్లి చేసుకొని డబ్బులు, నగలతో పరార్‌.. చివరికి

#bangalore #telugu-news #kumaraswamy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe