Harish Rao: ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్ట్ ను సందర్శించారు బీఆర్ఎస్ నేతలు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ను పడగొట్టాలంటే కాళేశ్వరం పడగొడితే సరిపోతుందని రేవంత్ ఆలోచిస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రగతి భవన్ ను బాంబులతో లేపేస్తాం అని గతంలో సీఎం రేవంత్ అన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. మెగా ప్రాజెక్ట్ కట్టినప్పుడు చిన్న చిన్న లోపాలు సహజం అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయినట్లు కాంగ్రెస్, బీజేపీ నేతలు గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అన్నారం బ్యారేజిలో లోపాలు ఉంటే సరి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Harish Rao: కేసీఆర్ను లేకుండా చేయాలని రేవంత్ కుట్ర.. హరీష్ సంచలన వ్యాఖ్యలు
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను లేకుండా చేయాలని సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ను పడగొట్టాలంటే కాళేశ్వరం పడగొడితే సరిపోతుందని రేవంత్ ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ప్రగతి భవన్ను బాంబులతో లేపేస్తామని గతంలో సీఎం రేవంత్ అన్నారని గుర్తు చేశారు.
Translate this News: