గల్ఫ్కు చెందిన ఎన్నారైలు శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ ఆపదలో ఉన్న రైతులకు అండగా ఉండి, వారికి తన వంతు ఆర్థిక సహాయం అందిస్తుండంతో మేము సైతం అని ముందుకు వచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యుల సారధ్యంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన. అలమూరు ఎన్నారైలు పవన్ కళ్యాణ్కు కోటి రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు గల్ఫ్ యూనిట్ కోఆర్డినేటర్ రాయుడు వెంకటేశ్వరరావు పవన్ కళ్యాణ్కు కోటి రూపాయల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ విరాళాన్ని కువైట్, మస్కట్, ఖతార్, బెహరిన్, సౌదీ అరేబియా దేశాల్లో ఉన్న జనసేన పార్టీ అభిమానులు సేకరించారన్నారు.
పూర్తిగా చదవండి..పవన్కు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన గల్ఫ్ ఎన్నారై సభ్యులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో గల్ఫ్ దేశాలకు చెందిన ఎన్నారైలు సమావేశమయ్యారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్తో భేటీ అయిన ఎన్నారైలు.. పవన్ రైతులను ఆదుకుంటున్నారని, తాము కుడా రైతులకు ఆదుకోవాలని వచ్చినట్లు తెలిపారు. అందుకోసం ఎన్నారైలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కోటి రూపాయల చెక్కును అందజేశారు.
Translate this News: