Group-1: గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని టీజీపీఎస్సీ వెల్లడించింది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో డిస్క్రిప్టివ్ విధానంలో ఈ పరీక్షలు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది.

Group-1: గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల
New Update

Group-1: తెలంగాణలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఇటీవల ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెయిన్స్ పరీక్ష(Group-1) షెడ్యూల్‌ను విడుదల చేసింది టీజీపీఎస్సీ. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో డిస్క్రిప్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న భాషలోనే పరీక్ష రాసే వీలు కల్పిస్తున్నామని స్పష్టం చేసింది.

Also Read: ఘోర అగ్నిప్రమాదం.. 40 మంది భారతీయులు మృతి

ఇదిలాఉండగా.. జూన్‌ 9న 895 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 4.03 లక్షల మందికి పైగా అప్లై చేసుకున్నారు.  వీళ్లలో 3.02లక్షల మంది మాత్రమే పరీక్షకు హాజరైనట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. దీనిప్రకారం చూస్తే కేవలం 74 శాతం మాత్రమే పరీక్ష రాశారు. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ కీ ని త్వరలోనే విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది.

Also Read: 24 ఏళ్లకి మారిన ప్రభుత్వం.. ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాంఝీ ప్రమాణం

#telugu-news #group-1 #national-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe