Government Officials Gave Shock To MP Vijayasai Reddy’s Daughter : వైసీపీ (YCP) ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaysai Reddy) కూతురుకి షాక్ ఇచ్చారు అధికారులు. విశాఖ జిల్లా భీమిలిలో ఆయన కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను అధికారులు కూల్చివేతకు సిద్ధమయ్యారు. సీఆర్జెడ్ గైడ్ లైన్స్ను ఉల్లంఘిస్తూ చేపట్టిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. 1516, 1517, 1519, 1523 సర్వే నంబర్లలోని స్థలంలో ఈ కాంక్రీట్ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇవి అక్రమ కట్టడాలంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో పిటిషన్ వేయగా… విచారించిన ధర్మాసనం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.
పూర్తిగా చదవండి..YCP : ఎంపీ విజయసాయి రెడ్డికి అధికారులు షాక్
AP: ఎంపీ విజయసాయిరెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. విశాఖలో ఆయన కూతురు నేహారెడ్డి నిబంధనలు ఉల్లఘించి నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.
Translate this News: