Hyderabad: దారుణం.. 20 రోజులుగా హోటల్లో బంధీగా బాలిక

నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన 19 ఏళ్ల బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆమెను హైదరాబాద్‌కు రప్పించి నారాయణగూడలోని ఓ హోటల్లో 20 రోజులు బంధించాడు. చివరికి సమాచారం మేరకు పోలీసులు ఆమెను రక్షించారు.

Hyderabad: దారుణం.. 20 రోజులుగా హోటల్లో బంధీగా బాలిక
New Update

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ 19 ఏళ్ల బాలికను హోటల్ గదిలో 20 రోజులుగా బంధించడం కలకలం రేపింది. చివరికి సమాచారం తెలుసుకున్న షీ టీమ్ సిబ్బంది ఆదివారం సాయంత్రం ఆ బాలికను రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో కృష్ణచైతన్య అనే వ్యక్తి రెండేళ్ల క్రితం పరిచయమయ్యాడు. ప్రేమపేరుతో నమ్మించి, పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెప్పి హైదరాబాద్‌కు రప్పించాడు. ఆ తర్వాత నారాయణగూడలోని ఓ హోటల్ గదిలో 20 రోజులుగా బంధించాడు.

Also Read: పేదవాళ్లపై సర్కారు కర్కశం.. హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్‌ ఫైర్

ఎట్టకేలకు ఆ బాలిక.. ఫోన్‌ద్వారా తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వాట్సాప్‌లో లొకేషన్ పంపించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వచ్చి షీ టీమ్స్‌ని ఆశ్రయించారు. నారాయణగూడలోని ఓ హోటల్‌లో బాధితురాలి లొకేషన్‌ గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి బాలికను రక్షించారు. ఆ తర్వాత నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కృష్ణచైతన్య పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది.

#hyderabad #telugu-news #telangana
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe