Delhi: ఢిల్లీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నలుగురు కలిసి ఘోరం

ఢిల్లీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. చెత్త ఏరుకునే 12ఏళ్ల బాలికపై సదన్ బజార్‌లో ఓ టీ స్టాల్ యజమాని, అందులో పనిచేసే మరో ముగ్గురు మైనర్ బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. జనవరి 1న ఈ దారుణం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
Delhi: ఢిల్లీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నలుగురు కలిసి ఘోరం

Gang Rape : దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో మరో దారుణం జరిగింది. మైనర్(Minor Girl) బాలికను నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్(Gang Rape) చేసిన సంఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కొత్త సంవత్సరం రోజే జనవరి 1న ఈ భయంకరమైన ఘనట జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని సదన్ బజార్‌లో ఉన్న ఓ టీ స్టాల్ యజమాని నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి ప్లాన్ చేశాడు. అయితే ఇందులో భాగంగానే ఒక మహిళను రాత్రికి తీసుకురావాలని అదే ప్రాంతంలో రోజు చెత్త ఏరుకునే ఒక మహిళ సాయం కోరాడు. ఈ క్రమంలో అతని దగ్గర కొంత డబ్బు తీసుకున్న ఆమె.. జనవరి 1న ఒక బాలికను (12)ను ఖుర్షీద్ మార్కెట్‌లోని భవనం పైకప్పు నుంచి చెత్త సేకరించాలని చెప్పి తీసుకొచ్చింది. అయితే అప్పటికే ఆమె రాక కోసం ఎదురుచూస్తున్న టీ స్టాల్ ఓనర్, అందులో పనిచేసే ముగ్గురు మైనర్ అబ్బాయిలు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించగా ఆమె భయపడిపోయింది.

ఇది కూడా చదవండి : Murder : ఎమ్మెల్సీ సోదరుడు.. మాజీ మావోయిస్టు దారుణ హత్య!

ఇక అక్కడినుంచి తిరిగి ఇంటికి వచ్చిన బాలిక రెండు రోజులుగా డల్ గా కనిపించడంతో ఇంట్లో వాళ్లకు అనుమానం వచ్చింది.  బంధువులు, తల్లి దండ్రులు ఆరాతీయగా అసలు విషయం బయటపెట్టింది. కుటుంబ సభ్యులు వెంటనే బాలికను తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేశారు. టీ షాపు యజమాని ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) నివాసి కాగా, అందులో పనిచేసే ముగ్గురు అబ్బాయిలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు