Ap Road Accident : కల్వర్టును ఢీకొన్న కారు.. నలుగురు అక్కడిక్కడే మృతి!

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి దగ్గర కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికీ గాయాలు అయ్యాయి. చనిపోయిన వారిని నెల్లూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Ap Road Accident : కల్వర్టును ఢీకొన్న కారు.. నలుగురు అక్కడిక్కడే మృతి!
New Update

Tirupati : తిరుపతి జిల్లా (Tirupati District) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి దగ్గర కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి (4 People Dead) చెందగా, ఇద్దరికీ గాయాలు అయ్యాయి. చనిపోయిన వారిని నెల్లూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా కూడా తిరుమల (Tirumala) స్వామి వారిని దర్శించుకుని కాణిపాకం వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read: ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌!

#car-accident #chandragiri #tirupati #andhra-pradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe