Ap Road Accident : కల్వర్టును ఢీకొన్న కారు.. నలుగురు అక్కడిక్కడే మృతి!
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి దగ్గర కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికీ గాయాలు అయ్యాయి. చనిపోయిన వారిని నెల్లూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.