తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఫిక్స్..పవన్ కల్యాణ్ కీలక ప్రకటన..!!

New Update
తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఫిక్స్..పవన్ కల్యాణ్ కీలక ప్రకటన..!!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీ తన వ్యూహాలకు మరింత పదునుపెట్టింది. తెలంగాణలో జనసేనతో పొత్తు కోసం ప్రయత్నించిన బీజేపీ ఆ దిశగా దూకుడుగా వ్యవహారించింది. దీనిలో భాగంగానే జనసేన అధినేత పనవ్ కళ్యాణ్ తో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారం సాయంత్రం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పవన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఓబీసీ మోర్చా చైర్మన్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొత్తుతోపాటుగా, సీట్ల పంపకాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోగా...పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

పవన్ కల్యాణ్ ఏమన్నారంటే:

-తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించాం.

-ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశాం.

-సుహృధ్బావంగా ఎన్నికల్లో పోటీ అంశంపై చర్చిస్తున్నాం.

-మేము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయి.

-రెండు స్థానాల విషయంలో ఇంకా తేలాల్సి ఉంది మరోసారి బిటి అవుతాం.

-మా పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ అంశాన్ని సమన్వయం చేస్తున్నారు.

-నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలి .

-ఇటీవల జరిగిన ఎన్డీయే మీటింగ్ లో కూడా ఈ దేశానికి మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడాము.

-ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు.

-మోదీ హాజరు అయ్యే సభకు నన్ను ఆహ్వానించారు. ఈ సభలో పాల్గొంటాను.

భేటీ అనంతరం కిషన్ రెడ్డి వ్యాఖ్యలు:

-ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ మాకు జీహెచ్ఏంసీ ఎన్నికల్లో ఎంతో సహకరించింది.

-ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి.

-తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉంది.

-జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి.

-రెండు సీట్ల అంశంపై చర్చించాల్సి ఉంది.

-ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు.

-ఈ సభకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించాం”

publive-image

ఇది కూడా చదవండి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేత దారుణ హత్య..!!

Advertisment
తాజా కథనాలు