/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pawan-jpg.webp)
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీ తన వ్యూహాలకు మరింత పదునుపెట్టింది. తెలంగాణలో జనసేనతో పొత్తు కోసం ప్రయత్నించిన బీజేపీ ఆ దిశగా దూకుడుగా వ్యవహారించింది. దీనిలో భాగంగానే జనసేన అధినేత పనవ్ కళ్యాణ్ తో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారం సాయంత్రం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పవన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఓబీసీ మోర్చా చైర్మన్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొత్తుతోపాటుగా, సీట్ల పంపకాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోగా...పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.
పవన్ కల్యాణ్ ఏమన్నారంటే:
-తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించాం.
-ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశాం.
-సుహృధ్బావంగా ఎన్నికల్లో పోటీ అంశంపై చర్చిస్తున్నాం.
-మేము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయి.
-రెండు స్థానాల విషయంలో ఇంకా తేలాల్సి ఉంది మరోసారి బిటి అవుతాం.
-మా పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ అంశాన్ని సమన్వయం చేస్తున్నారు.
-నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలి .
-ఇటీవల జరిగిన ఎన్డీయే మీటింగ్ లో కూడా ఈ దేశానికి మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడాము.
-ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు.
-మోదీ హాజరు అయ్యే సభకు నన్ను ఆహ్వానించారు. ఈ సభలో పాల్గొంటాను.
ఈ నెల 7న LB స్టేడియంలో @BJP4Telangana అధ్వర్యంలో జరగనున్న BC సదస్సు కు ప్రధాని శ్రీ @narendramodi గారితో కలిసి పాల్గొననున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#TelanganaElection2023 #JSPBJPAlliance
— 𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@JSPTelangana) November 4, 2023
భేటీ అనంతరం కిషన్ రెడ్డి వ్యాఖ్యలు:
-ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ మాకు జీహెచ్ఏంసీ ఎన్నికల్లో ఎంతో సహకరించింది.
-ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి.
-తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉంది.
-జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి.
-రెండు సీట్ల అంశంపై చర్చించాల్సి ఉంది.
-ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు.
-ఈ సభకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించాం”
ఇది కూడా చదవండి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేత దారుణ హత్య..!!