Brain Eating Amoeba : బ్రెయిన్ ఈటింగ్‌ అమీబాతో చిన్నారి మృతి..

కేరళకు చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి 'బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా'తో మృతి చెందింది. కొన్నిరోజుల క్రితం చెరువులో స్నానానికి వెళ్లిన ఆ చిన్నారి అనారోగ్యానికి గురైంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఆమె మెదడుపై ప్రభావం చూపడంతో మృతిచెందిందని వైద్యులు తెలిపారు.

Brain Eating Amoeba : బ్రెయిన్ ఈటింగ్‌ అమీబాతో చిన్నారి మృతి..
New Update

5 Years Old Girl Child Dead : కేరళ (Kerala) లోని మలప్పురం జిల్లాకు చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి 'బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా' (Brain Eating Amoeba) తో మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మే1, 10 వ తేదీల్లో స్థానికంగా ఉన్న చెరువులోకి ఆ చిన్నారి స్నానానికి వెళ్లింది. ఆ తర్వాత అనారోగ్యానికి గురైన ఆ చిన్నారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కలుషితమైన ఆ నీటిలో ఫ్రీ లివింగ్ అమీబా (Free Living Amoeba) ఆమె ముక్కునుంచి శరీరంలోకి వెళ్లిందని.. ఆ తర్వత మెదడుపై తీవ్ర ప్రభావం చూపిందని వైద్యులు చెప్పారు. ఆమెకు వచ్చిన వ్యాధిని సరైన సమయంలో కుటుంబ సభ్యులు గుర్తించకపోవడం వల్ల వైద్య చికిత్స (Medical Treatment) ఆలస్యంగా జరిగిందని.. అందుకే ఆ బాలిక మృతి చెందినట్లు వెల్లడించారు.

Also read: మైనర్ బాలుడికి బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు..

పరాన్నజీవీ కాని బ్యాక్టీరియా వర్గానికి చెందిన ఒక రకమైన అమీబా వల్ల ఈ వ్యాధి వస్తుంది. కలుషితమైన నీటిలో ఉండే ఈ జీవి.. మనుషుల ముక్కు లేదా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఇది మెదడుపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మెదడు క్రమంగా పనిచేయడం మానేస్తుంది. ఒకరకంగా దీన్ని మెదడును తినే అమీబాగా పిలుస్తారు. ఈ వ్యాధి వచ్చిన వారికి ముందుగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. వెంటనే చికిత్స చేయకపోతే ఈ వ్యాధికి గురైన బాధితుడు మరణించే ప్రమాదం ఉంటుంది. 2017, 2023లో కూడా కేరళలో ఇలాంటి కేసులు వెలుగుచూశాయి. ఈ వ్యాధిని వైద్య భాషలో అమీబిక్‌ మెనింగోన్సిఫాలిటీస్‌ అని అంటారు.

Also read: మేము అధికారంలోకి వస్తే ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్

#kerala-news #telugu-news #brain #ameoba
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి