AP: వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి 5 మంది కార్పొరేటర్లు..!

విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఐదు మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.

New Update
AP:  వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి 5 మంది కార్పొరేటర్లు..!

Janasena: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ఈ రోజు మొదలైన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల తరువాత జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికపై మాజీ సీఎం జగన్ (YS Jagan) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించారు. కూటమి మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే, గెలుపు తమదేనంటూ మాజీ మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకు? జగన్‌పై ఎమ్మెల్యే ఫైర్..!

అయితే, తాజాగా విశాఖ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఐదు మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఒకేసారి ఐదు మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరడంతో ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపు తధ్యం అంటున్నారు కూటమి నేతలు.

Advertisment
తాజా కథనాలు