Telangana: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాంప్లెక్స్‌లో మంటలు

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీదత్తసాయి కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.

New Update
Telangana: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాంప్లెక్స్‌లో మంటలు

హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీదత్తసాయి కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంట ధాటికి కాంప్లెక్స్ అద్దాలు పగిలిపోయి రోడ్డుపై పడ్డాయి. దీంతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. అలాగే ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Also read: వాళ్లకు రుణమాఫీ బంద్.. రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం !

Advertisment
తాజా కథనాలు