కన్నకొడుకుల గొంతు కోసిన కసాయి తండ్రి.. రెండేళ్ల పసిప్రాణం బలి

కన్నతండ్రే మైనర్ పిల్లల గొంతు కోసి చంపిన ఘోరమైన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కుటుంబ గొడవల్లో భాగంగా ఈ దాడిచేయగా రెండేళ్ల పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు. ఐదేళ్ల అబ్బాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నిందితుడు అదే కత్తితో గొంతు కోసుకుని ఆస్పత్రిలో చేరాడు.

New Update
కన్నకొడుకుల గొంతు కోసిన కసాయి తండ్రి.. రెండేళ్ల పసిప్రాణం బలి

ఈ మధ్య కాలంలో కొంతమంది మనుషులు ఊహించని రీతిలో క్రూర మృగాలుగా మారిపోతున్నారు. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకోవడం లేదా ఇతరుల ప్రాణాలు తీసేస్తున్నారు. వయసు, ప్రాంతంతో సంబంధం లేకుండా బహిరంగంగానే కత్తులతో దాడిచేసి చంపేస్తున్నారు. ఇలాంటి దారుణమైన ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని వజీర్ పూర్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారు జామున ఇద్దరు మైనర్ కుమారుల గొంతు కోసి హతమార్చాలని ఒక తండ్రి ప్రయత్నించాడు. ఆ తరువాత అదే కత్తితో తాను కూడా గొంతు కోసుకున్నాడు.

ఢిల్లీలోని వజీర్ పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్ నగర్ సమీపంలో జేజే కాలనీలో ఇన్వర్టర్ మెకానిక్ గా పని చేసే 36 ఏళ్ల నిందితుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం క్షణికావేశంతో తన ఇద్దరు కొడుకుల గొంతు కోసి చంపేయడానికి ప్రయత్నించాడు. ఆ తరువాత తాను కూడా గొంతు కోసుకున్నాడు. ఆ సమయంలో అతడి భార్య ఇంట్లో లేదు. ఈ ఘటనలో రెండేళ్ల వయస్సున్న చిన్న కొడుకు ప్రాణాలు కోల్పోగా, ఐదేళ్ల వయస్సున్న పెద్ద కుమారుడు, ఈ దారుణానికి పాల్పడిన కన్నతండ్రి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఐదేళ్ల కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Also read :తండ్రి ఉద్యోగం కోసం తనయుడి దారుణం.. కిరాయి గుండాలతో కలిసి

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి నిందితుడు ఎందుకు పాల్పడ్డాడనే విషయంపై కుటుంబ సభ్యులను ప్రశ్నించగా ఈ దారుణానికి కారణం కుటుంబ గొడవలే అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడిపై హత్య, హత్యా ప్రయత్నం, ఆత్మహత్య ప్రయత్నం, తదితర నేరాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు