CRIME: కన్న తండ్రే కామాంధుడు.. తల్లికి తెలిసినా పట్టించుకోని వైనం!

18 ఏళ్ల కూతురిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ జీడిమెట్లలో చోటుచేసుకుంది. ఈ దారుణం గురించి తల్లికి చెప్పినా పట్టించుకోలేదు. ఓ యువకుడితో పరిచయం పెంచుకున్న ఆ అమ్మాయి అతని చేతిలో కూడా మోసపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై జరిగిన దారుణాలను బయటపెట్టింది.

Rape Case : మాజీ ఎమ్మెల్యే కూతురిపై అత్యాచారం.. రూ. 6 కోట్లు వసూల్!
New Update

Hyderabad : కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. కట్టకున్న భార్య లనే కాదు కన్న పిల్లలను సైతం లైంగింక వేధింపులకు గురిచేస్తూ క్రూరమృగాళ్లలా వ్యవహరిస్తున్నారు. వావి వరుసలు లేకుండా మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. కన్న పేగును పంచిన తండ్రి కళ్లు కామంతో మూసుకుపోతున్నాయి. సొంత బిడ్డ పైనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ ఇలాంటి దారుణమైన ఘటన హైదరాబాద్ లోని జీడిమెట్ల ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ మేరకు జీడిమెట్ల ఎస్ఐ పవన్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహర్‌కు(Bihar) నుంచి హైదరాబాద్(Hyderabad) వలస వచ్చిన ఓ కుటుంబం ముగ్గురు పిల్లలతో కలిసి కుత్బుల్లాపూర్‌ లో ఉంటున్నారు. అయితే ఓ కుమార్తె(18) తొమ్మిదో తరగతి వరకు చదువుకోగా.. కరోనా కారణంగా ఆమెను చదువు మాన్పించారు. దీంతో ఇంటి వద్దే ఉంటున్న ఆమెపై కొంతకాలంగా తండ్రి లైంగికంగా వేధిస్తున్నాడు. పలుమార్లు అత్యాచారం చేశాడు.ఎవరికీ చెప్పొద్దంటూ భయపెట్టాడు. అయితే కొన్నాళ్ల తర్వాత ఆ యువతి జరిగిదంతా తల్లికి చెప్పింది. దీంతో కుటుంబ పరువు పోతుందని ఆలోచించిన తల్లి తండ్రిపై లేనిపోనివి చెప్పొదని, ఆమె నోరు మూయించింది.

గతేడాది యువకుడితో పరిచయం:

ఇదిలావుంటే.. గతేడాది దీపావళికి వీరు బీహర్‌ నుంచి హైదరాబాద్ వస్తుండగా రైలులో అదే రాష్ట్రానికి చెందిన యువకుడు సంతోష్‌ ఆ యువతికి పరిచయమయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు చాట్‌ చేసుకున్నారు. అతడు బడంగ్‌పేట గాంధీనగర్‌లో ఉంటున్నట్లు చెప్పాడు. పరిచయం పెరిగి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 26న సంతోష్‌ కలవాలని కోరడంతో యువతి సికింద్రాబాద్‌ వెళ్లింది. ఇద్దరు కలిసి ఎన్టీఆర్‌ గార్డెన్‌, ట్యాంక్‌బండ్‌ ప్రాంతాల్లో తిరిగి..ఆ తర్వాత కుత్బుల్లాపూర్‌లో ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు సంతోష్. దీంతో చెప్పకుండా బయటకు వెళ్లినందుకు కొడతారనే భయంతో ఆమె తిరిగి సికింద్రాబాద్‌ స్టేషన్‌కి పారిపోయింది.

ఇది కూడా చదవండి : IndiGo: ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఇండిగో.. ఫ్లైట్ చార్జీలు తగ్గింపు

అయితే అక్కడ రవి అనే వ్యక్తి ఫోన్‌ తీసుకొని సంతోష్‌కు ఫోన్‌ చేయగా.. సంతోష్ తన ఇంటికి పిలిపించుకున్నాడు. రవి సాయంతో అక్కడికి వెళ్లగా మరుసటిరోజు అమ్మాయిని ఇంటికి వెళ్లాలని ప్రేమికుడు కోరాడు. దీంతో వెంట వచ్చిన రవిని తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరిన యువతి.. అతనితో అమీన్‌పూర్‌లోని గదికి వెళ్లింది. రెండురోజులు అక్కడే ఉండగా.. డిసెంబర్ 29న మద్యం మత్తులో రవి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో మరుసటిరోజే కుటుంబ సభ్యులకు జరిగిన విషయం వివరించింది. దీంతో బుధవారం రాత్రి ఫిర్యాదు చేసిన యువతి అన్ని దారుణాలను వివరించినట్లు జీడిమెట్ల పోలీసులు తెలిపారు. ఆమె తండ్రితో పాటు రవి అనే వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదుచేసి మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

#hyderabad #sexually-assaults #daughter #father
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe