చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పుంగనూరు వెళ్లారు. చంద్రబాబు నాయుడు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు పుంగనూరు నుంచి అంగళ్లుకు వెళ్లే రోడ్డుపై వాహనాన్ని అడ్డుగా పెట్టారు. చంద్రబాబు నాయుడు పుంగనూరు రాకుండా రోడ్డుపై బైఠాయించి వైసీపీ శ్రేణులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు నాయుడి కాన్వాయ్ని అడ్డుకున్న వైసీపీ నేతలు.. ఆయన వాహనంపై రాళ్ల దాడికి దిగారు. దీంతో చంద్రబాబు కాన్వాయ్లోని పలు వాహనాల అద్దాలు ధ్వంసం కాగా.. పలువురు టీడీపీ నేతలుకు, పోలీసులకు గాయాలయ్యాయి. అంతే కాకుండా వైసీపీ నేతలు పలు వాహనాలకు నిప్పంటించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో దశ డీఎస్పీ ప్రసాద్, సీసీఎస్ సీఐకి గాయాలయ్యాయి.
పూర్తిగా చదవండి..పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. కాల్పులు జరిపిన పోలీసులు
చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటన తీవ్ర ఉద్రిక్తకరంగా మారింది. చంద్రబాబు పుంగనూరు రాకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబు వాహనంపై రాళ్లదాడి చేశారు. దీంతో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది.
Translate this News: