భగవంతుడి ఆశీస్సులతోనే బయటపడ్డాం.. దాడి చేయించింది ఆయనే: వెల్లంపల్లి సంచలనం

జగన్ ను చంపే కుట్రలో భాగంగాన నిన్న ఆయనపై జరిగిన దాడి జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. జగన్‌ను చంపితే తప్ప అధికారం రాదని.. చంద్రబాబు, పవన్ అనుకున్నారని నిప్పులు చెరిగారు. హత్యాయత్నం జరిగితే టీడీపీ, జనసేన ట్రోల్స్ చేయడం బాధాకరమన్నారు.

భగవంతుడి ఆశీస్సులతోనే బయటపడ్డాం.. దాడి చేయించింది ఆయనే: వెల్లంపల్లి సంచలనం
New Update

MLA Vellampalli Srinivas Rao: భగవంతుడి ఆశీస్సులతోనే నిన్న జరిగిన దాడిలో జగన్ (Attack On Jagan), తాను క్షేమంగా బయటపడ్డానని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జగన్ ను హతమార్చాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు తన తొత్తులతో ఇలాంటి చర్యలకు దిగుతుంటాడని ఫైర్ అయ్యారు. దాడిని రాజకీయం చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలన్నారు. జనాలను నిరుత్సాహపడకూడదన్న ఆలోచనతోనే నిన్న దాడి జరిగిన తర్వాత యాత్ర కొనసాగించామన్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.

#vellampalli-srinivas #ap-elections-2024 #ycp #ap-cm-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe