Bhujanga Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ మాజీ అడిషినల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. 15 రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ విడిచి వెళ్లోద్దని ఆదేశాలు ఇచ్చింది.

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రాధాకిషన్ రావుకు రిమాండ్‌
New Update

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ అడిషినల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు (Nampally Court) మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అనారోగ్యం కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ భుజంగరావు (Bhujanga Rao) దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం..  15 రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లోద్దని ఆదేశాలు ఇచ్చింది. కాగా తెలంగాణ (Telangana) లో సంచలనంగా మారిన ఫోన్ టాపింగ్ కేసులో మార్చి 23న భుజంగరావును పోలీసులు అరెస్ట్ చేశారు. పలుమార్లు బెయిల్ కోసం అభ్యర్థించగా.. కోర్టు ఆ పిటిషన్లను తోసిపుచ్చింది. తాజాగా భుజంగరావుకు గుండె సమస్య కారణంగా బెయిల్మంజూరు చేసింది

NEWS IS BEING UPDATED...

Also Read : రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అభిషేక్ మను సింఘ్వీ

#telangana #bhujanga-rao #phone-tapping-case
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe