/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-26T083621.761-jpg.webp)
Chhattisgarh Encounter: తుపాకుల మోతతో దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. ఛత్తీస్ ఘడ్ లోని నారాయణ్ పూర్ జిల్లాలో పోలీసులు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. కొహక మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనంది-కుర్రేవాయ మధ్య అటవీలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదరుపడటంతో ఇరువురు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఆపరేషన్ లో ఎస్ టీఎఫ్, ఆర్ జీ, బీఎస్ ఎఫ్, ఐటీబీపీ పోలీసులు పాల్గొన్నట్లు ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.