Dantewada: బస్తర్ లో కాల్పుల మోత.. మావోయిస్టు మృతి

దంతెవాడ, సుక్మా జిల్లా సరిహద్దు ప్రాంతాలు కాల్పుల మోతాతో దద్దరిల్లాయి. బుధవారం సాయంత్రం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. అతన్ని చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రకటించింది.

New Update
Dantewada: బస్తర్ లో కాల్పుల మోత.. మావోయిస్టు మృతి

Chhattisgarh Encounter: దంతెవాడ, సుక్మా జిల్లా సరిహద్దు ప్రాంతాలు కాల్పుల మోతాతో దద్దరిల్లాయి. బుధవారం సాయంత్రం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు నడిచింది. ఒకరిపై ఒకరు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఒక నక్సలైట్ మృతి చెందాడు. అతని దగ్గర దేశీయ తుపాకీ, విప్లవ సాహిత్యం లభించినట్లు పోలీసులు వెల్లడించారు.

స్పెషల్ ఆపరేషన్‌..
పూర్తి వివరాల్లోకి వెళితే.. బస్తర్ రేంజ్ మిస్టర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి.సుందర్‌రాజ్ (BRP), డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దంతేవాడ రేంజ్ Mr.కమ్లోచన్ కశ్యప్ (BRP), డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్ CRPF దంతేవాడ రేంజ్ Mr. వికాస్ కథేరియా (BRP), పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ గౌరవ్రాయ్ (BRP), కమాండింగ్ ఆఫీసర్ 231 శ్రీ సురేంద్ర సింగ్, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ Mr.రామ్‌కుమార్ వర్మన్ (R.P.)ఆధ్వర్యంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

అడవి కొండపై మెరుపుదాడి..
ఇందులో భాగంగానే దంతెవాడ, సుక్మా జిల్లా సరిహద్దు ప్రాంతంలో నక్సలైట్ల ఉనికి గురించి నిఘా సమాచారం అందడంతో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గోవింద్ సింగ్ దివాన్ నేతృత్వంలో DRG, బస్తర్ ఫైటర్ (BFR), యంగ్ ప్లాటూన్ సంయుక్త దళం CRPF 231 (CRPF YP) నక్సల్ పెట్రోలింగ్ సెర్చ్ ఆపరేషన్‌కు బయలుదేరింది. ఈ క్రమంలోనే బుధవారం సుమారు 4 గంటల ప్రాంతంలో ఇప్పటికే గొండ్‌పల్లి, పర్లగట్ట, బాదేపల్లి మధ్య అడవి కొండపై మవోయిస్టులు మెరుపుదాడి చేశారు. పోలీసులను హత్య చేసి ఆయుధాలను దోచుకోవాలనే ఉద్దేశ్యంతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసు యంత్రాంగం కూడా ప్రతీకార చర్యలు చేపట్టిందని గోవింద్ సింగ్ తెలిపారు.

ఇది కూడా చదవండి : BIG BREAKING : కోడికత్తి కేసులో శ్రీనుకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

చంద్రన్న అలియాస్ సత్యం..
ఈ క్రమంలోనే పోలీసుల ప్రతీకార చర్యగా ఎదురుదాడి చేయడంతో నక్సలైట్లు కొండల్లోకి పారిపోయారని చెప్పారు. అయితే ఎన్‌కౌంటర్ తర్వాత ఘటనా స్థలంలో సోదాలు నిర్వహించగా ఒక పురుష మావోయిస్టు మృతదేహం, ఒక దేశీయ తుపాకీ ముక్క, నాలుగు బుల్లెట్స్, విప్లవ సాహిత్యం రోజువారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టును చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు. సుమారు 50 సంవత్సరాల వయసున్న ఆయన సింగారం, పోలీస్ స్టేషన్ కు చెందిన గొలపల్లి జిల్లాలోని సుక్మా నివాసి అని తెలిపారు. అతను 2013 సంవత్సరానికి ముందు మాడ్ డివిజన్‌లో డివిసి సభ్యుడు ఉన్నాడని (డివిసిఎం), గత కొన్ని సంవత్సరాలుగా సౌత్ బస్తర్ డివిజన్ జాగరగుండ ఏరియా కమిటీలో చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. మావోయిస్టులపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ.08 లక్షల రివార్డు ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు