Telangana: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌ రావుపై కేసు నమోదు

తెలంగాణలో ఓవైపు ఎన్నికల జరుగుతుండగా.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌ రావు.. 4వ నంబర్ కలిగిన టీ షర్ట్‌ను ధరించి కాంగ్రెస్‌కు ఓటేయాలని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేశారని బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు.

New Update
Telangana: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌ రావుపై కేసు నమోదు

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌ రావుపై కేసు నమోదైంది. ఓవైపు ఎన్నికల జరుగుతుండగా.. 4వ నంబర్ కలిగిన టీ షర్ట్‌ను ధరించి కాంగ్రెస్‌కు ఓటేయాలని రాజేందర్‌ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. దీంతో బీజేపీ కరీంగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారులు విచారణ జరిపిన అనంతరం రాజేందర్‌ రావుపై కేసు నమోదు చేశారు. ఇక తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 64.74 శాతం పోలింగ్ నమోదైంది.

Also Read: ముగ్గురు నేతలపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్..

Advertisment
తాజా కథనాలు