Andhra Pradesh: కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్

ఏపీ మాజీ సీఎం జగన్‌ను తాను కలవలేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్ చేశారు.కొందరు దుర్మార్గులు ఫేక్ ఫోటోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని..అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు.

Andhra Pradesh: కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్
New Update

ఇటీవల ఏపీ మాజీ సీఎం జగన్.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కలిసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. జగన్‌ మోహన్‌రెడ్డిని తాను కలవలేదని ఎక్స్‌ వేదికగా ట్వీట్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని నేను కలిశానంటూ కొందరు దుర్మార్గులు ఫేక్ ఫోటోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిని నేను కలవలేదు. అసత్య ప్రచారాలను నమ్మొద్దు' అని పేర్కొన్నారు. అయితే బెంగళూరులో జగన్‌.. డికేను కలిశారని.. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనంపై చర్చించాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

Also read: బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. 10 మంది అరెస్టు

#congress-party #ysrcp #dk-shiva-kumar #ys-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe