హీరో ధనుష్ కుమారుడికి షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. భారీ ఫైన్

తమిళ్ హీరో ధనుష్ కుమారుడికి తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా బైక్ పై అతివేగంగా వెళ్లినందుకు రూ.1000 జరిమానా విధించారు. అంతేకాదు స్వయంగా ఇంటికెళ్లి ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది.

New Update
హీరో ధనుష్ కుమారుడికి షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. భారీ ఫైన్

తమిళ్ స్టార్ హీరో ధనుష్‌ కుమారుడికి షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. రోడ్డుపై రూల్స్ బ్రేక్ చేసినందుకు తమిళనాడు పోలీసులు భారీ జరిమానా విధించారు. తాత రజనీకాంత్ ఇంటి నుంచి తన తండ్రి ధనుష్ ఇంటికి బైక్ పై అతను అతివేగంగా వెళ్లినట్లు గుర్తించారు. అంతేకాదు నేరుగా తన ఇంటికెళ్లి అబ్బాయికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది.

Also read :‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అతడే.. జోస్యం చెప్పిన యువరాజ్ సింగ్

అసలు విషయానికొస్తే.. త‌మిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడు, కూతురు ఐశ్వర్య-ధనుష్ దంపతుల పెద్ద కొడుకు కొన్నిరోజుల కిందట ఫ్రెండ్స్ తో కలిసి యాత్రకు వెళ్లాడు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ బైక్ పై రయ్యిమంటూ రోడ్లపై దూసుకెళ్లినట్లు సీసీ పుటేజీల ద్వారా గుర్తించిన తమిళనాడు పోలీసులు జరిమానా విధించారు. అంతేకాదు అతను యాత్రలో ఉన్నప్పడు హెల్మెట్ వాడలేదని తెలిపారు. అలాగే అతను తన తాత రజనీకాంత్ ఇంటి నుంచి తన తండ్రి ధనుష్ ఇంటికి కూడా వేగంగా వెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై చెన్నై ట్రాఫిక్ పోలీసులు విచారణ చేపట్టగా అది ధనుష్ కొడుకు యాత్రది అని తేలింది. దీంతో ఈ విష‌యంపై ట్రాఫిక్ పోలీసులు ధనుష్ ఇంటికి వెళ్లి యాత్రకు సలహా ఇచ్చారు. అంతే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపినందుకు యాత్రకు రూ.1000 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుండగా సెలబ్రిటీల పిల్లలు ఇలా చేస్తే సామాన్య జనాలు ఇంకెలా చేస్తారంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు