Bhatti Vikramarka: అమ్మవారికి పట్టు వస్తాలను సమర్పించిన డిప్యూటీ సీఎం భట్టి

TG: లాల్ దర్వాజా ఆలయంలో ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్తాలను సమర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆయన వెంట మంత్రి పొన్నం, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

New Update
Bhatti Vikramarka: అమ్మవారికి పట్టు వస్తాలను సమర్పించిన డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka Presented Pattu Vastralu To Mahankali Temple : ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి లాల్ దర్వాజా ఆలయం (Lal Darwaza Temple) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్తాలను సమర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రి పొన్నం ప్రభాకర్.

అమ్మవారికి బోనం సమర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సతీమణి మల్లు నందిని .శ్రీ మహంకాళి ఆలయం వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కు ఘనంగా స్వాగతం పలికారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు. తదంతరం చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.

Also Read : అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు



Advertisment
తాజా కథనాలు