Dil Raju : దిల్ ఉన్న మనిషి దిల్ రాజు..బలగం వేణుతో..!

పద్మశ్రీ అవార్డుకు నామినేట్ అయిన తెలంగాణ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పను బలగం టీమ్ సత్కరించింది. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమాలో దాసరి కొండప్ప చిన్న పాత్ర పోషించారు. ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు లక్ష రూపాయల చెక్ ను దాసరి కొండప్పకు అందించారు.

Dil Raju :  దిల్ ఉన్న మనిషి దిల్ రాజు..బలగం వేణుతో..!
New Update

Dil Raju : రిపబ్లిక్ డేను పురస్కరించుకుని కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లభించింది. ఏపీ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు లభించింది. తెలంగాణ నుంచి పద్మశ్రీపురస్కారానికి ఎంపికైన వారిలో వేలు ఆనందాచారి, కుర్రెళ్ల విఠలాచార్య , కేతావత్ సోమ్లాల్ , గడ్డం సమ్మయ్య , దాసరి కొండప్ప ఉన్నారు. త్వరలోనే వారంతా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించనున్నారు.

పద్మశ్రీ అవార్డుకు నామినేట్ అయిన తెలంగాణ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పను బలగం టీం సత్కరించింది. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమాలో దాసరి కొండప్ప చిన్న పాత్ర పోషించారు. అయ్యో శివుడా పాటను పాడారు. ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు లక్ష రూపాయల చెక్ ను దాసరి కొండప్పకు అందించారు.

తమ సినిమాలో నటించిన దాసరి కొండప్పకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు లభించిన ఆనందాన్ని బలగం టీమ్ షేర్ చేసింది. శాలువ కప్పి సన్మానించింది. శనివారం హైదరాబాద్ లోని దిల్ రాజు కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాసరికొండప్ప కుటుంబ సభ్యులతోపాటు కొంతమంది నటులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు లక్ష రూపాయల చెక్ ను దాసరి కొండప్పకు అందించారు.

ఇది కూడా చదవండి:  స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ బడ్జెట్ ఫోన్స్ పై ఓ లుక్కెయ్యండి..!!

#dil-raju #dasari-kondappa #balgam-team #balagam-venu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe